Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫార్మ్‌హౌస్ పార్టీలో వివాదం: ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 10:06 PM

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి
June 14, 2026 08:36 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాధవ సదన్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకుల విద్యాసంస్థల్లో అమలవుతున్న ప్రస్తుత సమయ సారిణి కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులపై అధిక ఒత్తిడి పడుతోందని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి దానిని సవరించాలని సూచించారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించడం, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం వంటి సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News