చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం
చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగులవాడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థి విద్యార్థినులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ బస్వాపురం పద్మావతి, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటూ, ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి