Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 08:13 PM

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం
June 15, 2026 06:47 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగులవాడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థి విద్యార్థినులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ బస్వాపురం పద్మావతి, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటూ, ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News