Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:06 PM

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం
14-06-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు 56 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న బత్తుల అనిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఒకరి రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత మంది యువత రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. “మీ రక్తపు చుక్క – ఎవరికో జీవన దీపం” అని పేర్కొన్నారు. 56 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న బత్తుల అనిల్ కుమార్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ వీరు మహేందర్, కశెట్టి రమేష్, షాబాద్ వీరన్న, తాటికొండ నాగనాథ్, పాండురంగారెడ్డి, బోనగిరి రమేష్ తదితరులు పాల్గొని బత్తుల అనిల్ కుమార్‌ను అభినందించి ఘనంగా సన్మానించారు.

Sthanikam

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం

Article Image

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు 56 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న బత్తుల అనిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఒకరి రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత మంది యువత రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. “మీ రక్తపు చుక్క – ఎవరికో జీవన దీపం” అని పేర్కొన్నారు. 56 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న బత్తుల అనిల్ కుమార్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ వీరు మహేందర్, కశెట్టి రమేష్, షాబాద్ వీరన్న, తాటికొండ నాగనాథ్, పాండురంగారెడ్డి, బోనగిరి రమేష్ తదితరులు పాల్గొని బత్తుల అనిల్ కుమార్‌ను అభినందించి ఘనంగా సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News