56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్కు ఘన సన్మానం
56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్కు ఘన సన్మానం
Krishna
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు 56 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న బత్తుల అనిల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఒకరి రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత మంది యువత రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. “మీ రక్తపు చుక్క – ఎవరికో జీవన దీపం” అని పేర్కొన్నారు. 56 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న బత్తుల అనిల్ కుమార్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ వీరు మహేందర్, కశెట్టి రమేష్, షాబాద్ వీరన్న, తాటికొండ నాగనాథ్, పాండురంగారెడ్డి, బోనగిరి రమేష్ తదితరులు పాల్గొని బత్తుల అనిల్ కుమార్ను అభినందించి ఘనంగా సన్మానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి