Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:09 PM

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం
15-06-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కొప్పుల వేణారెడ్డి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలని అన్నారు.

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు.

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి పురస్కారాలు ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా పాఠశాలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా ఎన్. మేఘనకు రూ.1,00,000, రెండో బహుమతిగా వి. శృతికి రూ.50,000, మూడో బహుమతిగా దీక్షితకు రూ.25,000 నగదు పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, సజీవ్, ఎన్. రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటాం

Article Image

మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కొప్పుల వేణారెడ్డి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలని అన్నారు.

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు.

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి పురస్కారాలు ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా పాఠశాలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా ఎన్. మేఘనకు రూ.1,00,000, రెండో బహుమతిగా వి. శృతికి రూ.50,000, మూడో బహుమతిగా దీక్షితకు రూ.25,000 నగదు పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, సజీవ్, ఎన్. రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News