Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:35 PM

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సంతోష్ బాబు

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సంతోష్ బాబు

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సంతోష్ బాబు
June 15, 2026 05:36 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్రలో చిరస్థాయి


6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు

దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమర జవాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి లక్ష్మి అన్నారు. దేశ సార్వభౌమత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన సంతోష్ బాబు వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గల్వాన్ లోయలో దేశ సరిహద్దుల రక్షణలో అపార ధైర్యసాహసాలు ప్రదర్శించి శత్రువులను ఎదుర్కొన్న సంతోష్ బాబు అసాధారణ సైనికుడని పేర్కొన్నారు. తన ప్రాణాలను లెక్కచేయకుండా దేశ గౌరవాన్ని కాపాడేందుకు చేసిన పోరాటం యావత్ భారత జాతికి గర్వకారణమని అన్నారు.

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. యువత సంతోష్ బాబు జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని, దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, త్యాగస్ఫూర్తిని అలవరచుకోవాలని సూచించారు.డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ, సంతోష్ బాబు త్యాగం కేవలం తెలంగాణకే కాదు, దేశానికే గర్వకారణమన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి లక్ష్మి మాట్లాడుతూ, వీర జవాన్ల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి అమర జవాన్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News