Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:30 PM

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో  సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు
June 15, 2026 02:18 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News