Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:48 AM

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో  సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు
15-06-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్భాటాలకు దూరంగా.. అన్నదానంతో సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

Article Image

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News