PRINT TIME: June 15, 2026 08:52 PM
అంగన్వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ
అంగన్వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ
June 15, 2026 07:23 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు, పలకలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఢిల్లీ చంద్రకళ-మల్లారెడ్డి దంపతులు తమ మనవరాలి మూడో జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని చిన్నారులకు పండ్లతో పాటు రాయడానికి వీలుగా 50 పలకలను అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు, అంగన్వాడీ నిర్వాహకులు చంద్రకళ-మల్లారెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయా సిబ్బంది, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి