Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 08:52 PM

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ
June 15, 2026 07:23 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు, పలకలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఢిల్లీ చంద్రకళ-మల్లారెడ్డి దంపతులు తమ మనవరాలి మూడో జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని చిన్నారులకు పండ్లతో పాటు రాయడానికి వీలుగా 50 పలకలను అందజేశారు.​ అనంతరం గ్రామానికి చెందిన మహిళలు, అంగన్‌వాడీ నిర్వాహకులు చంద్రకళ-మల్లారెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా సిబ్బంది, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News