తప్పుల్లేకుండా ముసాయిదా జాబితా రూపొందించాలి..
అధికారులకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..
నల్లగొండ : ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్ఏ) పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవనంలో ఈఆర్వోలు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకించి ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శనకు ముందు ఒకటి కంటే రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
తప్పులకు తావుండొద్దు..
చిరునామా మారిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన (ఆబ్సెంట్) ఓటర్ల వివరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూపర్వైజర్లను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ బాలు తదితరులు పాల్గొని ఎన్నికల నిబంధనలు ఓటర్ల జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి