Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:06 PM

చిట్యాలలో కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాలలో కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాలలో కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
June 08, 2026 08:01 PM 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సమావేశమై నూతన బాధ్యులను ప్రకటించారు.అసోసియేషన్ అధ్యక్షుడిగా గుంజ కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా ఏర్పుల స్వామి, ఉపాధ్యక్షుడిగా ఆగు వెంకన్న, కోశాధికారిగా సాగర్ల పవన్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జిట్టా సైదులు, సహాయ కార్యదర్శిగా వరికుప్పల పరుశురాములు బాధ్యతలు చేపట్టనున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ సభ్యులు, ట్రాక్టర్ యజమానులు అభినందించారు. అసోసియేషన్ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా పేర్కొంది. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సభ్యులు నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు."సభ్యుల ఐక్యతతో అసోసియేషన్ మరింత బలోపేతం" అనే లక్ష్యంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News