సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ
సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ
K.RAVI
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక సామాజిక ఉద్యమాలను సృష్టించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బోయ లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఉద్యమం ఎందరికో న్యాయం చేకూర్చిందని, రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ, పింఛన్లు ఎస్సీ వర్గీకరణ వంటివి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కన్వీనర్గా పంది రాకేష్, కో-కన్వీనర్గా చెరుకుపల్లి హరికాంత్లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ సంజీవ, ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్, సీనియర్ నాయకులు వలిగొండ యాదయ్య, ఆర్.బి రాములు, కట్టెల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి