Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ
10-06-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక సామాజిక ఉద్యమాలను సృష్టించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బోయ లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఉద్యమం ఎందరికో న్యాయం చేకూర్చిందని, రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ, పింఛన్లు ఎస్సీ వర్గీకరణ వంటివి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కన్వీనర్‌గా పంది రాకేష్, కో-కన్వీనర్‌గా చెరుకుపల్లి హరికాంత్‌లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ సంజీవ, ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్, సీనియర్ నాయకులు వలిగొండ యాదయ్య, ఆర్.బి రాములు, కట్టెల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక ఉద్యమాల సృష్టికర్త ఎమ్మార్పీఎస్: దుబ్బ రామకృష్ణ

Article Image

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక సామాజిక ఉద్యమాలను సృష్టించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బోయ లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఉద్యమం ఎందరికో న్యాయం చేకూర్చిందని, రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ, పింఛన్లు ఎస్సీ వర్గీకరణ వంటివి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కన్వీనర్‌గా పంది రాకేష్, కో-కన్వీనర్‌గా చెరుకుపల్లి హరికాంత్‌లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ సంజీవ, ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్, సీనియర్ నాయకులు వలిగొండ యాదయ్య, ఆర్.బి రాములు, కట్టెల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News