బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించిన చిరుమర్తి లింగయ్య
బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించిన చిరుమర్తి లింగయ్య
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నర్రా శ్రీకాంత్ రెడ్డి ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడగా, ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య, వైద్యుల సూచనలను పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలని కోరిన ఆయన, శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి