వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్
వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్
Editor Desk
వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
అందరూ హాజరుకావాలి:
గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి