Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం
01-06-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెండోసారి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పుట్టినరోజున నియామక పత్రం అందజేత

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పంతంగి గ్రామానికి చెందిన బోయ దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సహకారంతో దేవేందర్ ఈ బాధ్యతలను దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా బోయ దేవేందర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు, సీనియర్ నాయకులు ఆడం సంజీవరెడ్డి, పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవేందర్ స్పష్టం చేశారు.

Sthanikam

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం

Article Image

రెండోసారి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పుట్టినరోజున నియామక పత్రం అందజేత

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పంతంగి గ్రామానికి చెందిన బోయ దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సహకారంతో దేవేందర్ ఈ బాధ్యతలను దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా బోయ దేవేందర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు, సీనియర్ నాయకులు ఆడం సంజీవరెడ్డి, పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవేందర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News