మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం
మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం
K.RAVI
రెండోసారి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పుట్టినరోజున నియామక పత్రం అందజేత
చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పంతంగి గ్రామానికి చెందిన బోయ దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సహకారంతో దేవేందర్ ఈ బాధ్యతలను దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా బోయ దేవేందర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు, సీనియర్ నాయకులు ఆడం సంజీవరెడ్డి, పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవేందర్ స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి