బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.
బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి విశేష సేవలు అందించిన పంచాయతీ కార్యదర్శి ఎస్కే రసూల్, వ్యవసాయ విస్తరణ అధికారి మామిండ్ల కిరణ్లకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శిగా ఎస్కే రసూల్ ఆరు సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధికి సేవలందించారని, వ్యవసాయ విస్తరణ అధికారిగా మామిండ్ల కిరణ్ ఏడు సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచి విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని అధికారులను సన్మానించారు. భవిష్యత్లో వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి