Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 07:56 PM

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.
June 05, 2026 05:54 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి విశేష సేవలు అందించిన పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే రసూల్, వ్యవసాయ విస్తరణ అధికారి మామిండ్ల కిరణ్‌లకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శిగా ఎస్‌కే రసూల్ ఆరు సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధికి సేవలందించారని, వ్యవసాయ విస్తరణ అధికారిగా మామిండ్ల కిరణ్ ఏడు సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచి విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని అధికారులను సన్మానించారు. భవిష్యత్‌లో వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News