Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 06:48 PM

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి
June 05, 2026 05:35 PM 5 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం డీఈవో సుశీందర్‌రావును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక కొంతమంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు అమలు చేస్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోనూ కనీసం 75 శాతం రాయితీ కల్పించాలని కోరినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన డీఈవో సుశీందర్‌రావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి జర్నలిస్టుల పిల్లలకు 70 శాతం వరకు ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పరమేశ్‌, మాదరి యాదగిరి, ఎర్రెడ్ల చంద్రశేఖర్‌రెడ్డి, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు, వంగాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News