జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి
Editor Desk
నల్లగొండ, : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం డీఈవో సుశీందర్రావును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక కొంతమంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు అమలు చేస్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోనూ కనీసం 75 శాతం రాయితీ కల్పించాలని కోరినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన డీఈవో సుశీందర్రావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి జర్నలిస్టుల పిల్లలకు 70 శాతం వరకు ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పరమేశ్, మాదరి యాదగిరి, ఎర్రెడ్ల చంద్రశేఖర్రెడ్డి, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు, వంగాల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి