Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:24 AM

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం
27-05-2026 364 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో రైతు సామ జగన్మోహన్‌రెడ్డికి భారీ నష్టం

లక్షల్లో ఆస్తినష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు

రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతు సామ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న కోళ్ల ఫారం అర్ధరాత్రి వచ్చిన గాలిదుమారానికి పూర్తిగా నేలమట్టమైంది. ఒక్కసారిగా షెడ్లు కూలిపోవడంతో ఫారంలోని పరికరాలు, ఫీడ్ సామగ్రి ధ్వంసమై రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.గాలి వేగానికి టిన్‌షీట్లు ఎగిరిపోవడంతో పాటు ఫారం నిర్మాణం మొత్తం కుప్పకూలిపోయింది.

ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవలే అప్పులు చేసి ఫారాన్ని అభివృద్ధి చేసుకున్న జగన్మోహన్‌రెడ్డి, జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

“ఏళ్ల తరబడి కష్టపడి ఏర్పాటుచేసుకున్న ఫారం క్షణాల్లో నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి” అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Sthanikam

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

Article Image

చిట్యాల మున్సిపాలిటీలో రైతు సామ జగన్మోహన్‌రెడ్డికి భారీ నష్టం

లక్షల్లో ఆస్తినష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు

రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతు సామ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న కోళ్ల ఫారం అర్ధరాత్రి వచ్చిన గాలిదుమారానికి పూర్తిగా నేలమట్టమైంది. ఒక్కసారిగా షెడ్లు కూలిపోవడంతో ఫారంలోని పరికరాలు, ఫీడ్ సామగ్రి ధ్వంసమై రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.గాలి వేగానికి టిన్‌షీట్లు ఎగిరిపోవడంతో పాటు ఫారం నిర్మాణం మొత్తం కుప్పకూలిపోయింది.

ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవలే అప్పులు చేసి ఫారాన్ని అభివృద్ధి చేసుకున్న జగన్మోహన్‌రెడ్డి, జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

“ఏళ్ల తరబడి కష్టపడి ఏర్పాటుచేసుకున్న ఫారం క్షణాల్లో నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి” అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News