ఎలక్ట్రిషన్లకు లైసెన్సులు తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఆర్–1, డబ్ల్యూఆర్–2 విధానం అమలు చేయాలని విజ్ఞప్తి.
ఎలక్ట్రిషన్లకు లైసెన్సులు తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఆర్–1, డబ్ల్యూఆర్–2 విధానం అమలు చేయాలని విజ్ఞప్తి.
Editor Desk
తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యుత్ శాస్త్రవేత్త నికోలా టెస్లా జయంతి ఆదివారం రామంతాపూర్లోని కమిటీ హాల్లో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి మాట్లాడుతూ, ప్రతి ఎలక్ట్రిషన్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్మన్ పర్మిట్తో పాటు సూపర్వైజర్ పర్మిట్ కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే అమలులో ఉన్న ఆర్ఆర్–1, డబ్ల్యూఆర్–2 విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం అమలైతే విద్యుత్ ప్రమాదాలు తగ్గి, పనుల్లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ నిర్వాహకుడు కొండ బాల్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రిషన్ల సంఘాలు జేఏసీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వృత్తిపరమైన సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే జేఏసీ లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో నేమాల బెనర్జీ, వై. వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్, ఉదయ్ భాస్కర్, సామల శ్రీకాంత్ రెడ్డి, బడే యాదగిరి, వి. సత్యనారాయణ, కాశీ నాయుడు, మాకం శ్రీనివాస్, నాగేశ్వరరావు, గురుస్వామి, వెంకటేష్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి