Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం
12-07-2026 255 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రూ.339 కోట్ల హ్యామ్ ప్రాజెక్ట్ పనులకు ఘనంగా శంకుస్థాపన


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో చిట్యాల–భువనగిరి హ్యామ్ రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రూ.339 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్యాల–భువనగిరి మార్గం జిల్లాలో కీలక రహదారిగా మారిందని, రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుతం పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు రవాణా సమయం తగ్గి ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

Article Image

రూ.339 కోట్ల హ్యామ్ ప్రాజెక్ట్ పనులకు ఘనంగా శంకుస్థాపన


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో చిట్యాల–భువనగిరి హ్యామ్ రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రూ.339 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్యాల–భువనగిరి మార్గం జిల్లాలో కీలక రహదారిగా మారిందని, రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుతం పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు రవాణా సమయం తగ్గి ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News