Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు
12-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోలీసులకు సమాచారం.. యుగతులసి గోశాలకు తరలింపు

అక్రమంగా తరలిస్తున్న 24 గోవులను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వలిగొండ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..ఆదివారం వేకువజామున కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టణ శివార్లలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు.​వాహనంలో ఉన్న 24 గోమాతలను రక్షించి, వెంటనే వలిగొండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రక్షించిన గోవులను సురక్షితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యుగతులసి ఫౌండేషన్‌ గోశాలకు తరలించారు. గోరక్షణకు సహకరించిన కార్యకర్తలను పలువురు అభినందించారు.

Sthanikam

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

Article Image

పోలీసులకు సమాచారం.. యుగతులసి గోశాలకు తరలింపు

అక్రమంగా తరలిస్తున్న 24 గోవులను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వలిగొండ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..ఆదివారం వేకువజామున కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టణ శివార్లలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు.​వాహనంలో ఉన్న 24 గోమాతలను రక్షించి, వెంటనే వలిగొండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రక్షించిన గోవులను సురక్షితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యుగతులసి ఫౌండేషన్‌ గోశాలకు తరలించారు. గోరక్షణకు సహకరించిన కార్యకర్తలను పలువురు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News