Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

తాడూరు చంద్రం ఆరోగ్యంపై ఆరా.. సంఘం సభ్యుల మర్యాదపూర్వక భేటీ

తాడూరు చంద్రం ఆరోగ్యంపై ఆరా.. సంఘం సభ్యుల మర్యాదపూర్వక భేటీ

తాడూరు చంద్రం ఆరోగ్యంపై ఆరా.. సంఘం సభ్యుల మర్యాదపూర్వక భేటీ
11-07-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 11: శ్రీ భవాని కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షుడు తాడూరు చంద్రం ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంఘం సభ్యులు, కార్యవర్గ ప్రతినిధులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సంఘం నాయకులు, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి తాడూరు చంద్రం అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

అనారోగ్య సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సభ్యులు భరోసా ఇచ్చారు. సంఘం సభ్యుల ఆప్యాయ పరామర్శకు తాడూరు చంద్రం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ భవాని కుమ్మరి సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

తాడూరు చంద్రం ఆరోగ్యంపై ఆరా.. సంఘం సభ్యుల మర్యాదపూర్వక భేటీ

Article Image

చిట్యాల, జూలై 11: శ్రీ భవాని కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షుడు తాడూరు చంద్రం ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంఘం సభ్యులు, కార్యవర్గ ప్రతినిధులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సంఘం నాయకులు, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి తాడూరు చంద్రం అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

అనారోగ్య సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సభ్యులు భరోసా ఇచ్చారు. సంఘం సభ్యుల ఆప్యాయ పరామర్శకు తాడూరు చంద్రం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ భవాని కుమ్మరి సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News