18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్గా ఏలే సుధాకర్ ఎన్నిక
18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్గా ఏలే సుధాకర్ ఎన్నిక
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏలే సుధాకర్ చైర్మన్గా,గర్దాస్ చంద్రమౌళి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.సంఘం పాలకవర్గ సభ్యులుగా అందే రాములు,తిరందాస్ దానయ్య,ఎలగందుల హరినాథ్,గర్దాస్ లలిత,గర్దాస్ మణెమ్మ ఎన్నికయ్యారు.
ఎన్నికల అనంతరం చేనేత జిల్లా కార్యాలయంలో నూతన చైర్మన్ ఏలే సుధాకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 18 సంవత్సరాల తర్వాత సంఘానికి చారిత్రాత్మకంగా ఎన్నికలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.సంఘం సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ,వారి ఆశయాలకు అనుగుణంగా చేనేత సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి అర్హ సభ్యునికి పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.ఇంకా సభ్యత్వం లేని అర్హులందరికీ సభ్యత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘ సభ్యుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి,వారితో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి