Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:35 PM

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక
11-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏలే సుధాకర్ చైర్మన్‌గా,గర్దాస్ చంద్రమౌళి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.సంఘం పాలకవర్గ సభ్యులుగా అందే రాములు,తిరందాస్ దానయ్య,ఎలగందుల హరినాథ్,గర్దాస్ లలిత,గర్దాస్ మణెమ్మ ఎన్నికయ్యారు.

ఎన్నికల అనంతరం చేనేత జిల్లా కార్యాలయంలో నూతన చైర్మన్ ఏలే సుధాకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 18 సంవత్సరాల తర్వాత సంఘానికి చారిత్రాత్మకంగా ఎన్నికలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.సంఘం సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ,వారి ఆశయాలకు అనుగుణంగా చేనేత సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి అర్హ సభ్యునికి పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.ఇంకా సభ్యత్వం లేని అర్హులందరికీ సభ్యత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘ సభ్యుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి,వారితో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏలే సుధాకర్ చైర్మన్‌గా,గర్దాస్ చంద్రమౌళి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.సంఘం పాలకవర్గ సభ్యులుగా అందే రాములు,తిరందాస్ దానయ్య,ఎలగందుల హరినాథ్,గర్దాస్ లలిత,గర్దాస్ మణెమ్మ ఎన్నికయ్యారు.

ఎన్నికల అనంతరం చేనేత జిల్లా కార్యాలయంలో నూతన చైర్మన్ ఏలే సుధాకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 18 సంవత్సరాల తర్వాత సంఘానికి చారిత్రాత్మకంగా ఎన్నికలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.సంఘం సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ,వారి ఆశయాలకు అనుగుణంగా చేనేత సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి అర్హ సభ్యునికి పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.ఇంకా సభ్యత్వం లేని అర్హులందరికీ సభ్యత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘ సభ్యుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి,వారితో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News