జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ
జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ
Editor Desk
నల్గొండ, : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఎస్ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'జస్ట్ బ్రేక్' సెంటర్ను గురువారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఆధునిక సేవా కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇర్ఫాన్ మహమ్మద్, సమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ అలీ, హనుబాయ్, సంస్థ నిర్వాహకులు ఎం.డి. జాఫర్ ఖాన్, ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి