PRINT TIME: July 03, 2026 10:12 PM
గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్
గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్
July 03, 2026 09:10 PM
119 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
* నిందితులను రిమాండ్ కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు
చౌటుప్పల్ ప్రాంతంలో కలకలం రేపిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న (గురువారం) నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిమాండ్కు వెళ్లిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మోహన్ మహలిక్ (28, వృత్తి: కూలీ), రంగారెడ్డి జిల్లా షామీర్పేట మజీద్పూర్ నివాసి దీనబంధు సాహూ (32, వృత్తి: కూలీ) ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై గట్టి నిఘా ఉంచామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి