Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌
03-07-2026 345 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* నిందితులను రిమాండ్ కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

చౌటుప్పల్ ప్రాంతంలో కలకలం రేపిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న (గురువారం) నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిమాండ్‌కు వెళ్లిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మోహన్ మహలిక్ (28, వృత్తి: కూలీ), రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మజీద్‌పూర్ నివాసి దీనబంధు సాహూ (32, వృత్తి: కూలీ) ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై గట్టి నిఘా ఉంచామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Sthanikam

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

Article Image

* నిందితులను రిమాండ్ కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

చౌటుప్పల్ ప్రాంతంలో కలకలం రేపిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న (గురువారం) నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిమాండ్‌కు వెళ్లిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మోహన్ మహలిక్ (28, వృత్తి: కూలీ), రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మజీద్‌పూర్ నివాసి దీనబంధు సాహూ (32, వృత్తి: కూలీ) ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై గట్టి నిఘా ఉంచామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News