ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు అంశంపై జూలై 6న రౌండ్ టేబుల్ సమావేశం
ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు అంశంపై జూలై 6న రౌండ్ టేబుల్ సమావేశం
Prabhakar
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో "ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.
ఈ సమావేశం 2026 జూలై 6 (సోమవారం) మధ్యాహ్నం 1:30 గంటలకు, హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్లో నిర్వహించబడుతుంది.
తెలంగాణ ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఉద్యోగ సంఘాలు (అసోసియేషన్లు), రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరై తమ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు అందించాలని యూనియన్ కోరింది.
ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను వేగవంతం చేయడం, గత ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ చట్టం నెం. 07 ఆఫ్ 2023ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయించడం, అలాగే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణ రూపొందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.
బహుజన వర్కర్స్ యూనియన్ 2026 జూన్ 21న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘంగా ఏర్పడి, "సంపూర్ణ ఉద్యోగ భద్రతతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి" అనే ఏకైక లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోందని నాయకత్వం వెల్లడించింది.
కావున అన్ని కార్మిక సంఘాల నాయకులు మరియు అసోసియేషన్ నాయకులు సమయానికి సమావేశానికి హాజరై ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు కోసం ఐక్య పోరాటానికి సహకరించాలని బహుజన వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి