Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం
03-07-2026 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో నూతనంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి అన్ని మౌలిక వసతులతో పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేశామని వివరించారు. అలాగే గత ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, వివిధ మండలాల ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో నూతనంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి అన్ని మౌలిక వసతులతో పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేశామని వివరించారు. అలాగే గత ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, వివిధ మండలాల ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News