ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం
ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో నూతనంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి అన్ని మౌలిక వసతులతో పోలీస్ స్టేషన్గా అభివృద్ధి చేశామని వివరించారు. అలాగే గత ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, వివిధ మండలాల ఎస్ఐలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి