చౌటుప్పల్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్!
చౌటుప్పల్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్!
K.RAVI
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటుప్పల్ ఎస్హెచ్ఓ (ఇన్స్పెక్టర్) జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై సూర కృష్ణ మాల్ తన సిబ్బందితో కలిసి పరిధిలోని వివిధ ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చౌటుప్పల్ సమీపంలోని సూర్యోదయ స్పిన్నింగ్ మిల్లు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో బ్యాగులో దాచి ఉంచిన 48 గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి.
పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితులు మోహన్ మహలిక్ (28) తండ్రి రామలంతా మహలిక్, వృత్తి రీత్యా కూలీ, ఒడిస్సా రాష్ట్ర నివాసి.దీనబంధు సాహూ (32) తండ్రి శ్రీకాంత్ సాహో, వృత్తి రీత్యా కూలీ, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షామీర్పేట్ పరిధిలోని మజీద్పూర్లో నివసిస్తున్నాడు. పట్టుబడిన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు, నిందితులిద్దరిపై చట్టరీత్యా కేసు నమోదు చేశారు. ఈ చాక్లెట్లను ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఎవరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి