PRINT TIME: July 03, 2026 09:21 AM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
July 03, 2026 07:55 AM
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ లోని కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, కోదాడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి వేముల వెంకటేశ్వర్లు ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదాడ టౌన్ ఎస్ఐ బి. సుధీర్ కుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటి వినియోగం, రవాణా, విక్రయం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి