Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:48 PM

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్
July 02, 2026 09:20 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మూతపడిన జూనియర్, డిగ్రీ కళాశాలలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయరు.. పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు.. విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అంటూ బీసీ విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్త బీసీ జేఏసీ పిలుపులో భాగంగా గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ పూర్తి విజయవంతమైంది. పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు.​ బీసీ నేత వీరమళ్ళ కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు."ఆదాయ పరిమితులు, కొత్త నిబంధనల పేరుతో పేదలను చదువుకు దూరం చేయాలని చూస్తే ఊరుకోం. పాత విధానాన్నే కొనసాగించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి."

​రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులను ప్రభుత్వం హరించాలని చూస్తోందని, బకాయిలు తక్షణమే విడుదల చేయకపోతే విద్యార్థి, యువజన, బీసీ సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బండి గారి శ్రీధర్, కొప్పు రామకృష్ణ, నవీన్, భరత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News