లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్
Vikram Journalist
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించిన తేజస్ నంద్ లాల్ పవార్
హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థినులతో ముచ్చటించి చదువు, బోధనపై ఆరా తీశారు. అనంతరం చేతిలో చాక్పీస్ పట్టుకుని బ్లాక్బోర్డుపై స్వయంగా గణిత పాఠాలు బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
విద్యార్థులు గణితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, క్లిష్టమైన సూత్రాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని అన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి