వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం
Krishna
సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, బోరు మోటార్లను మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, వార్డు కౌన్సిలర్ లక్ష్మీప్రియ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీప్రియ, వార్డు ఇన్చార్జి శరత్ చంద్ర మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా వార్డు ప్రజలు రోడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తికావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, సజ్జి, కో-ఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, నాయకులు వైద్యం పవన్, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గారెల తుల్జారాం, ఎరుకల సాయిలు, హైమద్, మహబూబ్, విజయ్ కుమార్, మతిన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి