భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి
Komidala Mahender reddy
జీవో 12 రద్దు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగింత నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్.
చిట్యాల, జూలై 1: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించకుండా, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే జీవో నెం.12ను వెంటనే రద్దు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం నేరుగా పథకాలను అమలు చేసి కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు.
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లకు వెంటనే నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చిట్యాల డిప్యూటీ తహశీల్దార్ విజయకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సుక్క నర్సింహా, కార్యదర్శి వడ్డెపల్లి శంకర్, నాయకులు చిర్రబోయిన గట్టయ్య, దోర్నాల సంజీవ్, గూని రమేష్, ఇస్కిళ్ల ఎల్లయ్య, జన్నాయకోడె సత్యనారాయణ, ఐతరాజు నర్సింహా, లడె రాములు, వడ్డెపల్లి నర్సింహా, దొడ్డి యాదయ్యతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి