Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:37 PM

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి
July 01, 2026 05:10 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జీవో 12 రద్దు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగింత నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్.


చిట్యాల, జూలై 1: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించకుండా, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే జీవో నెం.12ను వెంటనే రద్దు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం నేరుగా పథకాలను అమలు చేసి కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు.

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చిట్యాల డిప్యూటీ తహశీల్దార్ విజయకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సుక్క నర్సింహా, కార్యదర్శి వడ్డెపల్లి శంకర్, నాయకులు చిర్రబోయిన గట్టయ్య, దోర్నాల సంజీవ్, గూని రమేష్, ఇస్కిళ్ల ఎల్లయ్య, జన్నాయకోడె సత్యనారాయణ, ఐతరాజు నర్సింహా, లడె రాములు, వడ్డెపల్లి నర్సింహా, దొడ్డి యాదయ్యతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News