చిట్యాల, జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మూడ సుదర్శన్ను ఘనంగా సన్మానించారు. శాలువా, మెమొంటో, పుష్పగుచ్ఛంతో సత్కరించి వైద్య సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రేగులగడ్డ నరసింహ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. కార్యదర్శి పాటి మాధవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని అన్నారు.
కార్యక్రమంలో పొన్నం లక్ష్మయ్య గౌడ్, రంగా వెంకటేశ్వర్లు, ఏనుగు కాంతిరెడ్డి, వరకంతం భాస్కర్ రెడ్డి, బెలిదే సత్యనారాయణ, పబ్బతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొని వైద్యులకు అభినందనలు తెలిపారు. సన్మానం పొందిన వైద్యులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి