PRINT TIME: June 30, 2026 09:44 PM
ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా
ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా
June 30, 2026 08:25 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ నూతన ఎస్సైగా ఇషాక్ బాషా బాధ్యతలను స్వీకరించారు. ఈ స్టేషన్ లో ఉన్న ఉమాదేవి పుట్టపర్తి సాయిబాబా క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. కొన్ని రోజుల కిందట ఎస్సైగా ఇషాక్ భాషాను ఎస్పీ బదిలీ చేయగా, వచ్చిన వెంటనే విధులలో భాగంగా వివిధ చోట్ల బందోబస్తుగా వెళ్లడం జరిగింది. అనంతరం ఇషాక్ భాషా మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలోని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తానని వారు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని తెలిపారు. చట్టపరిధిలో జీవించే విధంగా ప్రజలు తమ జీవనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి