యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం
యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం
GADDAM JAGANMOHAN REDDY
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశంలోని యూరియా పరిశ్రమలు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గ్యాస్ సరఫరా దెబ్బతినడంతో భారతదేశంలో యూరియా ఉత్పత్తి తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గ్యాస్ లభ్యత తగ్గిపోవడంతో దేశంలోని అనేక యూరియా తయారీ ప్లాంట్లు ప్రస్తుతం సుమారు 60 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దేశంలో యూరియా కొరత తలెత్తే అవకాశముందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో టన్నుకు సుమారు 475 డాలర్లు ఉన్న యూరియా ధర ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు 600 డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ పెరుగుదల రైతులకు పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం మూతపడిన గ్యాస్ ప్లాంట్లు మళ్లీ పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాతే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు యూరియా ఉత్పత్తి మరియు సరఫరాపై ఒత్తిడి కొనసాగవచ్చని వారు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి