త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?
త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?
Editor Desk
న్యూఢిల్లీ: దేశంలో మహిళల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అడుగులు వేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 2027 జనగణన అనంతరం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (SRS), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) నివేదికల ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు గతంలో 19.3 ఏళ్లుగా ఉండగా, ప్రస్తుతం 23.1 ఏళ్లకు పెరిగినట్లు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 24.4 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్లుగా నమోదైంది.
ఈ నేపథ్యంలో మహిళలకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, మాతా-శిశు ఆరోగ్యం మెరుగుపర్చే లక్ష్యంతో కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ప్రతిపాదనపై 2021లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే 17వ లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు ల్యాప్స్ అయింది. ఇప్పుడు తాజా జనాభా, ఆరోగ్య గణాంకాల ఆధారంగా 2027 జనగణన తర్వాత మరోసారి బిల్లును తీసుకురావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి