ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో పని చేయాలి: మంత్రి సవితమ్మ
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో పని చేయాలి: మంత్రి సవితమ్మ
Anjali
గోరంట్ల మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ (Special Intensive Revision) అవగాహన కార్యక్రమంలో మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుందని, క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు, ఓటరు ధృవీకరణ విధానం, కుటుంబ లింకేజీల పరిశీలన, డ్రాఫ్ట్ ఓటరు జాబితా పరిశీలన, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై సమావేశంలో సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు.ప్రతి 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. జూలై 14వ తేదీలోపు రెండు దఫాలుగా ఓట్ల మ్యాపింగ్ జరుగుతుందని, అనంతరం జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనిచేయాలని మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి