Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:00 PM

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు
February 19, 2026 10:58 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణంగా మార్కెట్‌లో లభించే బియ్యం కిలో రూ.50 నుంచి రూ.150 వరకు ఉండగా, జపాన్‌కు చెందిన ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’ బియ్యం ధర మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిలోకు సుమారు రూ.12,500 నుంచి రూ.15,000 వరకు పలుకుతున్న ఈ ప్రత్యేక రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది.

ఈ ప్రీమియం రైస్‌ను జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఉత్పత్తి చేస్తోంది. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా నమోదు చేసింది.

గున్మా, నాగనో, నీగాటా ప్రాంతాల్లో పండే కోషిహికారీ, పికామారు వంటి ఐదు ఉత్తమ రకాల బియ్యాన్ని సమ్మిళితం చేసి దీన్ని తయారు చేస్తారు. కోత అనంతరం వెంటనే మార్కెట్‌లోకి రానివ్వకుండా ఆరు నెలల పాటు ప్రత్యేక పరిస్థితుల్లో నిల్వ ఉంచడం దీని ప్రత్యేకత.

అదనంగా, పేటెంట్ పొందిన ప్రత్యేక బఫింగ్/పాలిష్ విధానం ద్వారా బియ్యం పైపొర తొలగించినప్పటికీ పోషక విలువలు దెబ్బతినకుండా కాపాడుతారు. దీంతో వండిన అన్నం స్పటికాల్లా మెరిసిపోతూ, స్వల్ప తీపి రుచితో వెన్నలా నోట్లో కరిగిపోతుందని చెబుతున్నారు.

ప్రతి ఏడాది కేవలం వెయ్యి బాక్సులు మాత్రమే ఉత్పత్తి చేయడంతో ఇది లగ్జరీ గిఫ్ట్‌గా ప్రాచుర్యం పొందింది. జపాన్‌లో దీన్ని రోజువారీ ఆహారంగా కాకుండా విలాసవంతమైన కానుకగా అందించడం విశేషం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News