స్మార్ట్ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు
స్మార్ట్ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు
GADDAM JAGANMOHAN REDDY
సాధారణంగా మార్కెట్లో లభించే బియ్యం కిలో రూ.50 నుంచి రూ.150 వరకు ఉండగా, జపాన్కు చెందిన ‘కిన్మెమాయ్ ప్రీమియం’ బియ్యం ధర మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిలోకు సుమారు రూ.12,500 నుంచి రూ.15,000 వరకు పలుకుతున్న ఈ ప్రత్యేక రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రీమియం రైస్ను జపాన్లోని టోయో రైస్ కార్పొరేషన్ ఉత్పత్తి చేస్తోంది. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా నమోదు చేసింది.
గున్మా, నాగనో, నీగాటా ప్రాంతాల్లో పండే కోషిహికారీ, పికామారు వంటి ఐదు ఉత్తమ రకాల బియ్యాన్ని సమ్మిళితం చేసి దీన్ని తయారు చేస్తారు. కోత అనంతరం వెంటనే మార్కెట్లోకి రానివ్వకుండా ఆరు నెలల పాటు ప్రత్యేక పరిస్థితుల్లో నిల్వ ఉంచడం దీని ప్రత్యేకత.
అదనంగా, పేటెంట్ పొందిన ప్రత్యేక బఫింగ్/పాలిష్ విధానం ద్వారా బియ్యం పైపొర తొలగించినప్పటికీ పోషక విలువలు దెబ్బతినకుండా కాపాడుతారు. దీంతో వండిన అన్నం స్పటికాల్లా మెరిసిపోతూ, స్వల్ప తీపి రుచితో వెన్నలా నోట్లో కరిగిపోతుందని చెబుతున్నారు.
ప్రతి ఏడాది కేవలం వెయ్యి బాక్సులు మాత్రమే ఉత్పత్తి చేయడంతో ఇది లగ్జరీ గిఫ్ట్గా ప్రాచుర్యం పొందింది. జపాన్లో దీన్ని రోజువారీ ఆహారంగా కాకుండా విలాసవంతమైన కానుకగా అందించడం విశేషం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి