Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:39 AM

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు

స్మార్ట్‌ఫోన్ ధరకు బియ్యం! – కిలో రూ.15 వేల ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’కు గిన్నిస్ గుర్తింపు
February 19, 2026 10:58 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణంగా మార్కెట్‌లో లభించే బియ్యం కిలో రూ.50 నుంచి రూ.150 వరకు ఉండగా, జపాన్‌కు చెందిన ‘కిన్‌మెమాయ్ ప్రీమియం’ బియ్యం ధర మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిలోకు సుమారు రూ.12,500 నుంచి రూ.15,000 వరకు పలుకుతున్న ఈ ప్రత్యేక రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది.

ఈ ప్రీమియం రైస్‌ను జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఉత్పత్తి చేస్తోంది. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా నమోదు చేసింది.

గున్మా, నాగనో, నీగాటా ప్రాంతాల్లో పండే కోషిహికారీ, పికామారు వంటి ఐదు ఉత్తమ రకాల బియ్యాన్ని సమ్మిళితం చేసి దీన్ని తయారు చేస్తారు. కోత అనంతరం వెంటనే మార్కెట్‌లోకి రానివ్వకుండా ఆరు నెలల పాటు ప్రత్యేక పరిస్థితుల్లో నిల్వ ఉంచడం దీని ప్రత్యేకత.

అదనంగా, పేటెంట్ పొందిన ప్రత్యేక బఫింగ్/పాలిష్ విధానం ద్వారా బియ్యం పైపొర తొలగించినప్పటికీ పోషక విలువలు దెబ్బతినకుండా కాపాడుతారు. దీంతో వండిన అన్నం స్పటికాల్లా మెరిసిపోతూ, స్వల్ప తీపి రుచితో వెన్నలా నోట్లో కరిగిపోతుందని చెబుతున్నారు.

ప్రతి ఏడాది కేవలం వెయ్యి బాక్సులు మాత్రమే ఉత్పత్తి చేయడంతో ఇది లగ్జరీ గిఫ్ట్‌గా ప్రాచుర్యం పొందింది. జపాన్‌లో దీన్ని రోజువారీ ఆహారంగా కాకుండా విలాసవంతమైన కానుకగా అందించడం విశేషం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News