Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 10:40 PM

బాపన్ బాయి తండాలో ఘనంగా ‘ సీత్లా భవాని’ సంప్రదాయ పండుగ,

బాపన్ బాయి తండాలో ఘనంగా ‘ సీత్లా భవాని’ సంప్రదాయ పండుగ,

బాపన్ బాయి తండాలో ఘనంగా ‘ సీత్లా భవాని’ సంప్రదాయ పండుగ,
July 07, 2026 09:04 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

​తుంగతుర్తిమండల పరిధిలోని బపన్ బాయి, కర్నాలకుంట, సంధ్య తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని సంప్రదాయ పండుగను మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బంజారా గిరిజనుల విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకల్లో తండా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో గ్రామ ప్రజల ఆరోగ్యం, పశుసంపద రక్షణ, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.ఈ సందర్భంగా తండాకు చెందిన ఆడపడుచులు సంప్రదాయ గిరిజన వేషధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తండా పెద్దలు సంప్రదాయ ఆచారాల ప్రకారం సగౌరవంగా అమ్మవారికి కోడిపుంజులను బలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా జానపద విశ్వాసం ప్రకారం సప్త భవానులను (ఏడు మాతృదేవతలను) ప్రత్యేకంగా పూజించి, సామూహిక ప్రార్థనలు చేశారు. డోలు, డప్పుల నాదాలు, సంప్రదాయ గేయాల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో తండాలో పండుగ వాతావరణం సంతరించుకుంది.ఈ వేడుకల్లో బాపన్ భాయ్ తండా గ్రామ సర్పంచ్ బికోజి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సీత్లా భవాని పండుగ బంజారా గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి, సామాజిక ఐక్యతకు, ప్రకృతి పట్ల వారికి గల గౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలను, భాషను, జానపద కళలను యువత పరిరక్షించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బంజారాలు ఈ పండుగను ఒకే రోజు జరుపుకోవడం గిరిజనుల సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనమన్నారు. గిరిజనుల విశిష్ట సంస్కృతికి తగిన గౌరవం కల్పించేలా, శ్రీ సీత్లా భవాని పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించి, ఆ రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News