ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
Biksham
25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ
ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూర్యాపేట 25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ సూచించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే తీవ్రమైన ఇబ్బందులను నివారించవచ్చని చెప్పారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఇటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మోర శబరి, సాయి, శివరాజు, బోయిన సాయి, కోడి రాజేష్, నాగరాజు, వెన్నెల, రమణ, గౌతమ్, వెంకన్న, వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి సిబ్బంది జనార్ధన చారి, సీహెచ్ శంకర్, నిస్సి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి