PRINT TIME: July 06, 2026 08:54 PM
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్
July 06, 2026 06:54 PM
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ, జూలై 6:
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి