పిఆర్సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్
పిఆర్సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్
K.RAVI
* ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్
* చౌటుప్పల్లో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి రిపోర్టును తెప్పించుకొని, వెంటనే నూతన వేతన సవరణను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇటికాల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం (హైయర్ ఎడ్యుకేషన్) చేయడానికి సంబంధించిన జీవో 342 అమలుకు అడ్డంకిగా మారిన మెమో నెంబర్ 26659ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా, ఉపాధ్యాయుల పదోన్నతులలో ఆటంకంగా ఉన్న ‘ఆడక్వసీ’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు జనపాల కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఎస్. దుర్గయ్య, మేడి యాదయ్య, కే. మహేశ్వరి, జి. యశోద, ఈ. శ్వేత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి