Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 09:34 PM

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్
July 06, 2026 08:14 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్

​* చౌటుప్పల్‌లో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి రిపోర్టును తెప్పించుకొని, వెంటనే నూతన వేతన సవరణను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.​ ముఖ్య అతిథిగా హాజరైన ఇటికాల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం (హైయర్ ఎడ్యుకేషన్) చేయడానికి సంబంధించిన జీవో 342 అమలుకు అడ్డంకిగా మారిన మెమో నెంబర్ 26659ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా, ఉపాధ్యాయుల పదోన్నతులలో ఆటంకంగా ఉన్న ‘ఆడక్వసీ’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.​ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు జనపాల కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఎస్. దుర్గయ్య, మేడి యాదయ్య, కే. మహేశ్వరి, జి. యశోద, ఈ. శ్వేత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News