Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్
06-07-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్

​* చౌటుప్పల్‌లో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి రిపోర్టును తెప్పించుకొని, వెంటనే నూతన వేతన సవరణను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.​ ముఖ్య అతిథిగా హాజరైన ఇటికాల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం (హైయర్ ఎడ్యుకేషన్) చేయడానికి సంబంధించిన జీవో 342 అమలుకు అడ్డంకిగా మారిన మెమో నెంబర్ 26659ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా, ఉపాధ్యాయుల పదోన్నతులలో ఆటంకంగా ఉన్న ‘ఆడక్వసీ’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.​ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు జనపాల కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఎస్. దుర్గయ్య, మేడి యాదయ్య, కే. మహేశ్వరి, జి. యశోద, ఈ. శ్వేత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

Article Image

* ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్

​* చౌటుప్పల్‌లో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి రిపోర్టును తెప్పించుకొని, వెంటనే నూతన వేతన సవరణను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.​ ముఖ్య అతిథిగా హాజరైన ఇటికాల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం (హైయర్ ఎడ్యుకేషన్) చేయడానికి సంబంధించిన జీవో 342 అమలుకు అడ్డంకిగా మారిన మెమో నెంబర్ 26659ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా, ఉపాధ్యాయుల పదోన్నతులలో ఆటంకంగా ఉన్న ‘ఆడక్వసీ’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.​ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు జనపాల కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఎస్. దుర్గయ్య, మేడి యాదయ్య, కే. మహేశ్వరి, జి. యశోద, ఈ. శ్వేత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News