ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి
ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి
K.RAVI
ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్కు అఖిలపక్ష వినతి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా, చౌటుప్పల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమయానికి తెరుచుకోకపోవడంతో విద్యార్థులు బయటే వేచి ఉండాల్సి వచ్చిందని, పక్కనే కార్యాలయం ఉన్నా పట్టించుకోని ఎంఈఓ, డీఈఓలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి, అక్రమ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమల్ల కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, ఒంటెద్దు లింగస్వామి, వినయ్ రెడ్డి, ఊదరి రాకేష్, గంగాదేవి శివ, అత్తు, సాయి వంశీ, శైలేందర్, రామకృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి