Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి
06-07-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు అఖిలపక్ష వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​అదేవిధంగా, చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమయానికి తెరుచుకోకపోవడంతో విద్యార్థులు బయటే వేచి ఉండాల్సి వచ్చిందని, పక్కనే కార్యాలయం ఉన్నా పట్టించుకోని ఎంఈఓ, డీఈఓలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి, అక్రమ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమల్ల కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, ఒంటెద్దు లింగస్వామి, వినయ్ రెడ్డి, ఊదరి రాకేష్, గంగాదేవి శివ, అత్తు, సాయి వంశీ, శైలేందర్, రామకృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోండి

Article Image

ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు అఖిలపక్ష వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​అదేవిధంగా, చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమయానికి తెరుచుకోకపోవడంతో విద్యార్థులు బయటే వేచి ఉండాల్సి వచ్చిందని, పక్కనే కార్యాలయం ఉన్నా పట్టించుకోని ఎంఈఓ, డీఈఓలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి, అక్రమ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమల్ల కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, ఒంటెద్దు లింగస్వామి, వినయ్ రెడ్డి, ఊదరి రాకేష్, గంగాదేవి శివ, అత్తు, సాయి వంశీ, శైలేందర్, రామకృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News