ట్రాఫిక్ ఎస్ఐగా యాదవేందర్ రెడ్డి బాధ్యతలు
ట్రాఫిక్ ఎస్ఐగా యాదవేందర్ రెడ్డి బాధ్యతలు
Biksham
సాయిరాం సీసీఎస్కు బదిలీ
సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఆయనను సీసీఎస్కు బదిలీ చేయగా, సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్న యాదవేందర్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పెరిగిన వాహన రద్దీని నియంత్రించడంలో సాయిరాం కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లిన ఆయన, రహదారుల వెంట ఉన్న ఆక్రమణల తొలగింపుతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షించి వేగనిరోధకాలను ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఆయన పనితీరుకు ప్రజలు, వ్యాపారులు, పోలీసు అధికారులు ప్రశంసలు వ్యక్తం చేశారు.బదిలీ సందర్భంగా సాయిరాంను పలువురు అధికారులు, సిబ్బంది, స్థానికులు అభినందిస్తూ ఆయన సేవలను కొనియాడారు. కొత్త ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన యాదవేందర్ రెడ్డి కూడా పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి