సంస్థాన్ నారాయణపురం ఎస్ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ
సంస్థాన్ నారాయణపురం ఎస్ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ
K.RAVI
చట్టం ముందు అందరూ సమానమే
ఫిర్యాదులపై సత్వర న్యాయం అందిస్తాం
అందుబాటులో ఉంటూ ప్రజా పోలీసింగ్కు ప్రాధాన్యం
సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా సీత పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో బాధ్యతల రికార్డులపై సంతకం చేశారు. అనంతరం ఎస్ఐ సీత పాండు మీడియాతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మండల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా 'ప్రజా పోలీసింగ్' విధానానికి ప్రాధాన్యం ఇస్తాం.మండల పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సీత పాండును పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి