Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ
06-07-2026 393 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చట్టం ముందు అందరూ సమానమే

ఫిర్యాదులపై సత్వర న్యాయం అందిస్తాం

అందుబాటులో ఉంటూ ప్రజా పోలీసింగ్‌కు ప్రాధాన్యం

సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సీత పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో బాధ్యతల రికార్డులపై సంతకం చేశారు. ​అనంతరం ఎస్‌ఐ సీత పాండు మీడియాతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మండల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా 'ప్రజా పోలీసింగ్‌' విధానానికి ప్రాధాన్యం ఇస్తాం.మండల పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సీత పాండును పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ

Article Image

చట్టం ముందు అందరూ సమానమే

ఫిర్యాదులపై సత్వర న్యాయం అందిస్తాం

అందుబాటులో ఉంటూ ప్రజా పోలీసింగ్‌కు ప్రాధాన్యం

సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సీత పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో బాధ్యతల రికార్డులపై సంతకం చేశారు. ​అనంతరం ఎస్‌ఐ సీత పాండు మీడియాతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మండల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా 'ప్రజా పోలీసింగ్‌' విధానానికి ప్రాధాన్యం ఇస్తాం.మండల పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సీత పాండును పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News