Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:23 AM

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్
28-06-2026 1,202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

సమాచారం మేరకు, ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.

ప్రమాదం తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుకిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్

Article Image

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

సమాచారం మేరకు, ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.

ప్రమాదం తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుకిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News