గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్
గుండ్రంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, భారీ ట్రాఫిక్ జామ్
Komidala Mahender reddy
చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు, ఒక బైకు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.
సమాచారం మేరకు, ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.
ప్రమాదం తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుకిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి