ఇంద్రపాలనగరం: గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 0–5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల స్వామి జయసుధ, ఎంఎల్హెచ్పీ జ్యోతి, ఆశా కార్యకర్తలు వరమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి