హయీ కల్చూరి తెలంగాణ కమిటీ ఏకగ్రీవం. రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్ గౌడ్
హయీ కల్చూరి తెలంగాణ కమిటీ ఏకగ్రీవం. రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్ గౌడ్
Editor Desk
నాగోల్,
హైదరాబాద్లో జరిగిన అఖిల భారత హయీ కల్చూరి మహాసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ విస్తరణ, సమాజంలో ఐక్యత, తెలంగాణలో కార్యకలాపాల బలోపేతం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగోల్కు చెందిన శ్రవణ్ కుమార్ గౌడ్ ను , ప్రధాన కార్యదర్శి (కార్యాలయం)గా రాజ్గోపాల్, ప్రధాన కార్యదర్శి (సంస్థ)గా టి. సుదర్శన్ దేవుడు, ప్రధాన కార్యదర్శి (ప్రమోషన్)గా కప్పల్ రవీంద్ర దేవుడు, కోశాధికారిగా ఆనంద్ దేవుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
సమావేశానికి ప్రముఖ సినీనటుడు జైహింద్ గౌడ్, రాష్ట్రీయ మహిళా యూనిట్ జాతీయ ప్రధాన కార్యదర్శి రంజనా సూర్యవంశీ హాజరయ్యారు. జాతీయ కార్యదర్శి హరిరామ్ రాయ్ సంస్థ భవిష్యత్ కార్యాచరణను వివరించి, తెలంగాణలో సంస్థ విస్తరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి