Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 05:13 PM

**అభివృద్ధి గడప దాటని బుడిగ జంగాల కాలనీ డ్రైనేజీ లేదు.. తాగునీరు లేదు.. రేషన్ షాప్ లేదు

**అభివృద్ధి గడప దాటని బుడిగ జంగాల కాలనీ డ్రైనేజీ లేదు.. తాగునీరు లేదు.. రేషన్ షాప్ లేదు

**అభివృద్ధి గడప దాటని బుడిగ జంగాల కాలనీ డ్రైనేజీ లేదు.. తాగునీరు లేదు.. రేషన్ షాప్ లేదు
June 27, 2026 03:05 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా మండల కేంద్రంలోని బుడిగ జంగాల (ఎస్సీ) కాలనీలో ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య విమర్శించారు. అభివృద్ధిలోనూ దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ, సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించి, సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

20 ఏళ్ల క్రితం నిర్మించిన కాలనీలో నేటికీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల ముందే నిలిచిపోతోందని, వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీ బురదమయంగా మారి దోమలు, ఈగలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు.

తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, కాలనీలోని రెండు బోర్‌వెల్లు ఐదారు సంవత్సరాలుగా చెడిపోయినా మరమ్మతులకు నోచుకోలేదని తెలిపారు. కొన్ని ఇళ్లకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే బోర్లను బాగుచేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శి కాలనీని తక్షణమే సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కందుల హనుమంతు, గొరిగె సోములు, బావండ్ల బాలరాజు, గాదె నరేందర్, మేడి ముకుందం, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, కుందూరు వెంకటేశం, వెంకట్‌రెడ్డి, గంజి అశోక్, సల్ల రాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News