Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ
26-06-2026 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజ్మా నృత్య కళాకారులకు మాజీ సర్పంచ్ బీరప్పనోరు సురేఖ రాజకుమార్ 15 జతల కలగజ్జల పట్టీలు అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, మొహర్రం త్యాగానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగ అని, తెలంగాణ గంగాజమునీ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. షంసొద్దీన్ మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడిక్కర్ బాబు, నరుచే మచ్చేందర్, దర్గా వలే షంసొద్దీన్, అశోక్, షరీఫ్, తాజొద్దీన్, సంతోష్, ధర్మ, ఎం. పండరి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

Article Image

నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజ్మా నృత్య కళాకారులకు మాజీ సర్పంచ్ బీరప్పనోరు సురేఖ రాజకుమార్ 15 జతల కలగజ్జల పట్టీలు అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, మొహర్రం త్యాగానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగ అని, తెలంగాణ గంగాజమునీ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. షంసొద్దీన్ మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడిక్కర్ బాబు, నరుచే మచ్చేందర్, దర్గా వలే షంసొద్దీన్, అశోక్, షరీఫ్, తాజొద్దీన్, సంతోష్, ధర్మ, ఎం. పండరి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News