మత్తు రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్
మత్తు రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్
Vikram Journalist
డీ-అడిక్షన్ కేంద్రంలో బాధితులకు పండ్లు, క్రీడా సామగ్రి పంపిణీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పరీక్షా కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
మత్తు వ్యసనాల బారిన పడిన యువత సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి డీ-అడిక్షన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, బాధితులు స్వచ్ఛందంగా చికిత్స కోసం ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు డయల్ 100, 112 లేదా 1908 టోల్ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈగల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, వైద్యులు, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి